కోతులతో భయం..ఇండ్లలో చొరబడి వస్తువులు చిందర వందర.

మల్యాల జనవరి 24 : అడవుల్లో ఉండాల్సిన కోతులు జనావాసాలలోకి గుంపులు గుంపులుగా ఇండ్లలోకి ప్రవేశించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ హడలెత్తిస్తున్నాయి.కోతుల బెడద రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆకలితో అలమటిస్తూ ఊర్లో ప్రజలపై దాడులు చేస్తున్నాయి. మల్యాల మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉంది. మహిళలు, చిన్నారులు భయాందోళనకు గురి చేస్తూ వారిపై దాడులు భయాందోళనకు గురి చేస్తూ వారిపై దాడులు చేస్తున్నాయి. గ్రామాల్లో కోతుల దాడిలో గాయపడిన వారు చాలా మంది ఉన్నారు. ఇంటి తలుపులు వేయడం మరిచారో ఇక అంతే సంగతులు కోతులు ఇండ్లలోకి చేరి వంట సామాగ్రి, దుస్తులు, ఆహార పదార్థాలు చిందర వందర చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపైకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి భయపడుతున్నారు.

కోతుల నివారణకు పలుమార్లు పంచాయతీ అధికారులకు విన్నవించిన పట్టి స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతులను బెదిరించే ప్రయత్నం చేసిన అవి తిరిగి దాడి చేస్తున్నాయి. చేతిలోనూ, సంచిలోనూ ఏదైనా తీసుకొని వీధుల్లో నడుస్తున్న వారి పైన దాడి చేసి గాయపరచుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. గ్రామాల్లో కోతుల బెడద ప్రజలకు నిత్య కృత్యం గా మారింది అన్న సందేహం లేకపోలేదు. గ్రామాలలో ఇవాళ ఇది ఒక తీవ్రమైన సమస్యగా మారింది. పంచాయతీ అధికారులు స్పందించి కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
కోతుల నివారణకు పట్టింపేది?
అడవుల్లో కోతులకు సరైన ఆహారం దొరకకపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొనడానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. వాటికి ఆహారం కోసం గ్రామాలకు వస్తున్నాయి. వాటిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఉంటాయి. వారికి ఒక్కో కోతికి కొంత డబ్బును పంచాయతీ అధికారులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ వీటిపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదని విమర్శలున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు