కొడిమ్యాల అక్టోబరు 1 నవ వెలుగు :
జగిత్యాలలో జరిగిన జిల్లా స్థాయి అండర్ 14 కబడ్డి పోటీలలో కొడిమ్యాల ప్రథమ స్థానం నిలిచింది. అనంతరం కబడ్డి లో ప్రతిభ కనబరిచిన తిరుమలాపూర్ ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న బోయిని శివమణినీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోటీలకు నిర్వాహకులు ఎంపిక చేశారు.మంగళవారం పాఠశాలలో శివమణిని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు. త్వరలో జరిగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పోటీలకు జగిత్యాల జిల్లా నుండి ఆడనున్నారు. వీరు మరింత ప్రతిభ కనబరిచి రాష్ట స్థాయికి ఎంపిక కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.జ్యోస్నాదేవి,ఉపాద్యాయులు ఐలయ్య, నాగరాజ, లక్ష్మీ నారాయణ, స్వాతి, ఏనుగు ఆదిరెడ్డి, ఫహీమ్, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.









