ఢిల్లీ ఫిబ్రవరి 28 (నవ వెలుగు) : భారత జాతీయ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా నూతన జాతీయ అధ్యక్షులు వినోద్ జాఖర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఢిల్లీలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్, గుజరాత్ ఏఐసీసీ ఇంచార్జ్ సెక్రటరీ శ్రీనివాస్, బీ,వీ జమ్మూకశ్మీర్ డీసీసీ అధ్యక్షులు నీరజ్ కుందన్, విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, NSUI జాతీయ అధ్యక్షులు వినోద్ జాఖర్ కు అభినందనలు తెలిపారు.








