మల్యాల మార్చి 27 :
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యం పేట గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని రాష్ట్ర బీసి కమీషన్ చైర్మన్ నిరంజన్, బీసి కమీషన్ సబ్యులు జయ ప్రకాష్,సురేందర్,బాల లక్ష్మి, గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు ఘణ స్వాగతం పలికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డివో పులి మధుసూదన్ గౌడ్, జగిత్యాల జిల్లా డిపిఓ,మల్యాల తహసీల్దార్ పలువురు అధికారులు,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.









