రాయికల్ జనవరి 13 : రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం లో భాగంగా మంగళవారం రోజున గోదారంగనాథల కళ్యాణ మహోత్సవం పండితులు రామకృష్ణ చార్యులు అంగరంగ వైభవంగా కనుల పండుగ నిర్వహించారు. మహిళలందరూ గోదాదేవి అమ్మవారికి ఓడిబియ్యం కనుమలు కుడుకలు సమర్పించారు.. అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు.. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి అశ్విని జాదవ్ తిరుపతి, డాక్టర్ రఘునాథ్, అర్చకులు, నాయకులు గ్రామ సర్పంచ్ నీరటి శ్రీనివాస్, సామల వేణు, కాటిపల్లి గంగారెడ్డి, వార్డు సభ్యులు కొక్కెర రాజేందర్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు బోడుగం మల్లారెడ్డి, సురకంటి నాగిరెడ్డి, కనపర్తి శ్రీనివాస్, కొల్లూరు వేణు, చౌడరపు శ్రీధర్, మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.









