మంథని ఫిబ్రవరి 25 (నవ వెలుగు) : మంథనిలో ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు తెలుగు, హిందీ..సంస్కృతం,.. ఉర్దూ..పరీక్షలు జరిగాయి. మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. బాలికల కళాశాలలో మొత్తం 208 మంది విద్యార్థులకు గాను 202 మంది హజరయ్యారు. బాలుర కళాశాలలో 158 మందికి గాను 154 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపటి నుంచి ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి.









