పెగడపల్లి మార్చి 28 (నవ వెలుగు) : పెగడపల్లి మండలంలోని బతికపెల్లిలో శ్రీ గాయత్రి పాఠశాల విద్యార్థులు ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష కోసం 8మంది విద్యార్థులు హాజరువగా 8మంది విద్యార్థులు గురుకులాల్లో సీట్లు సాధించి మండలంలోనే 100%సీట్లు సాధించిన ఏకైక పాఠశాలగా నిలిచిందని పాఠశాల కరెస్పాండెంట్ రవికుమార్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు విమల మరియు పాఠశాల ఉపాధ్యాయులు రాకేష్, పలువురు సిబ్బంది పాల్గొని సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించారు.









