కొడిమ్యాల జులై 12 : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోనీ వూల్లే పోచమ్మ, హిందూర్ పోచమ్మ మరియు ఎల్లమ్మ దేవాలయాలకు చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు మరియు కొండగట్టు గిరి ప్రదక్షణ వ్యవస్థాపకులు సురేష్ ఆత్మారామ్ మహారాజ్ ఆధ్వర్యంలో మరియు దాతల సహకారంతో ఆషాడ మాసం సందర్భంగా చీరలు, ఒడి బియ్యం, పూజా సామాగ్రి , తదితర సామగ్రి నీ శనివారం అయోధ్య టీం మరియు కొండగట్టు గిరిప్రదక్షిణ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులకు, పూజారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అయోధ్య టీమ్,కొండగట్టు గిరిప్రదక్షిణ సభ్యులు చెన్న దేవేందర్ , ఏనుగు ఆదిరెడ్డి, మంచాల శ్రీనివాస్ ,కంచర్ల రామచం ద్రo, భోగ రాకేష్, బాలే గణేష్, ఇట్టి గంగాధర్,అర్చకులు దెందుకూరి భాస్కర్,పోచమ్మ ఎల్లమ్మ దేవాలయంల అధ్యక్షులు రాచకొండ చంద్ర మోహన్, గడ్డమీది గంగయ్య , నేరేళ్ల లక్ష్మణ్,ఆలయాల నిర్వాహకులు, ప్రజలు పాల్గొన్నారు.









